బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘హౌస్ఫుల్ 4’. పునర్జన్మల నేపథ్యంలో 1419, 2019 మధ్య కాలంలో సాగే ఈ కథలో బోలెడన్ని వినోదాలు ఉంటాయని అంటున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 600 ఏళ్ల తర్వాత పుట్టిన స్టార్స్ ఏ రకంగా ప్రేక్షకులని అలరించనున్నారనేది సినిమా చూస్తే అర్ధమవుతుంది. ఫర్హాద్ సంఝీ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు కథ రాసింది ఫర్హాదే. అసలైతే సినిమాను సాజిద్ ఖాన్ డైరెక్ట్ చేయాలి. కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగానే సాజిద్పై ఇద్దరు నటీమణులు లైంగిక ఆరోపణలు చేశారు. దాంతో సాజిద్ ఉంటే తాను సినిమా చేయనని అక్షయ్ తెలిపారు. దాంతో సాజిదే అవమానంతో సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక చేసేదేంలేక కథ రాసిన ఫర్హాద్ సంఝీనే డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్కు జోడీగా కృతిసనన్, రితేశ్ దేశ్ముఖ్కు జోడీగా పూజా హెగ్డే, బాబీ డియోల్కు జోడీగా కృతి కర్బంద నటించారు. ఇక బాహుబలి చిత్రంలో భళ్ళాలదేవ పాత్రతో దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న రానా దగ్గుబాటి “హౌస్ఫుల్-4” చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో నటించారు. నిన్న విడుదలైన హౌస్ఫుల్ 4 సినిమా దేశవ్యాప్తంగా రూ.18.85 కోట్ల వసూళ్లు రాబట్టింది. హౌస్ఫుల్ ఫ్రాంచైస్లో వచ్చిన అన్ని సినిమాలు హిట్టయ్యాయి కానీ ఈ సినిమా తొలిరోజు రాబట్టిన వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయాయి. ఈ సినిమాకు చేసిన భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే సినిమా చాలా చెత్తగా ఉందని రివ్యూలు వచ్చాయి. ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ సినిమాకు ఒక స్టార్ మాత్రమే ఇచ్చారు. డైరెక్షన్, యాక్టింగ్, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ ఏవీ బాలేవని అన్నారు. ఈ సినిమా తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపారు. తొలిరోజు కాబట్టి సినిమాకు రూ18 కోట్లు వచ్చినట్లున్నాయ్. ఈ వారం రోజుల పాటు కలెక్షన్లు ఇదే జోరు మీదుంటే రూ.100 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. లేకపోతే అక్షయ్కు దీపావళి కానుకగా విడుదల చేసిన సినిమా తీవ్ర నిరాశనే మిగులుస్తుంది.
previous post