telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ సినిమాకి కరోనా ఎఫెక్ట్

akshaykumar

అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ‘సూర్యవంశీ’ ఈనెల 24న విడుదల కావాల్సిఉంది. కానీ, కరోనా ఎఫెక్ట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్ర విడుదలను వాయిదా వేశారు. ఏడాదికి పైగా నిబద్ధతతో ఎంతో కష్టపడి అద్భుతమైన అనుభూతిని మీకు అందించేందుకు ‘సూర్యవంశీ’ చిత్రాన్ని తీర్చిదిద్దాం. ట్రైలర్‌కు వచ్చిన స్పందన అద్భుతం. ఈ స్పందనతో ఇది ప్రేక్షకుల సినిమా అని స్పష్టమైంది. ఈ సినిమాను మీకు, మీ కుటుంబానికి అందిద్దామని మేం కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యాం.కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మా ప్రియమైన ప్రేక్షకుల ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకుని ‘సూర్యవంశీ’ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించాం. సరైన సమయంలో ‘సూర్యవంశీ’ మీ ముందుకు వస్తుంది.‘సూర్యవంశీ’ తరఫున చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటనలో పేర్కొంది.

Related posts