telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అల వైకుంఠపురంలో” హిందీ రీమేక్ లో అక్షయ్

Akshay-Kumar

అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘అల వైకుంఠపురములో’ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాత అశ్విన్ వర్డే ఈ చిత్రం హక్కులను సుమారు 8 కోట్లకు దక్కించుకున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత దీని స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాలని చూస్తున్నారట. అంతేకాకుండా ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది కూడా తెలియాల్సి ఉంది. ఏదైనా ఏప్రిల్ 14 తర్వాత ఈ రీమేక్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఈ రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా అక్షయ్ ప్రస్తుతం ‘కాంచన’ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ‘లక్ష్మి బాంబ్’ పేరుతో విడుదల కానుంది. రాఘవ లారెన్స్ ఈ చిత్రానికి దర్శకుడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు.

Related posts