ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ పై బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం “మిషన్ మంగళ్”. ఈ చిత్రం ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్ ధావన్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. 2013లో భారత్ చేపట్టిన “మంగళ్యాన్” మిషన్ నేపథ్యంలో సాగే చిత్రమిది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని జగన్ శక్తి తెరకెక్కించారు. అక్షయ్ కుమార్ ఇందులో రాకేష్ పాత్ర పోషించగా, తాప్సీ, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్, కీర్తి కుల్హరి, షర్మన్ జోషి కీలక పాత్రల్లో నటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్తో అద్భుతమైన కలెక్షన్స్ను రాబట్టుకుంటోంది. విడుదలైన తొలి రోజే రూ.29.16 కోట్లు వసూలు చేసి..అక్షయ్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. తొలి నాలుగురోజుల్లోనే రూ.97.16కోట్లను వసూలు చేసిన ఈ చిత్రం సోమవారం నాటికి వందకోట్ల మార్కును రీచ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అక్షయ్ కుమార్ కెరీర్లోనే వందకోట్ల రూపాయలను అతి త్వరగా సాధించిన చిత్రంగా ఇది నిలువనుంది. మరోవైపు జాన్ అబ్రహాం నటించిన బట్లా హౌస్ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా మిషన్మంగళ్తోపాటు విడుదలైంది. అయితే కలెక్షన్ల పరంగా బట్లా హౌస్ తొలి రోజు రూ.15.55 కోట్లు వసూళు చేయగా..ఇప్పటివరకు మొత్తం రూ.47.99 కోట్లు వసూలు చేసింది. గతేడాది అక్షయ్కుమార్ నటించిన గోల్డ్, జాన్ అబ్రహాం సత్యమేవ జయతే చిత్రాలు బాక్సాపీస్ వద్ద ఓకేసారి విడుదలైన విషయం తెలిసిందే.
previous post