రోహిత్ శెట్టి దర్శకత్వంలో బాలీవుడ్ యాక్షన్ హీరో, ఖిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం “సూర్యవంశీ”. ఈ చిత్రాన్ని రోహిత్ శెట్టి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. 2020 ఈద్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే తాజాగా అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా ఓ ఫోటో షేర్ చేశాడు. ఈ ఫొటోలో అక్షయ్ కుమార్, చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టితో పాటు చిత్రానికి సంబంధించిన పలువురు ఫైట్ మాస్టర్కి గన్ను ఎక్కుపెట్టారు. ఈ ఫోటోకి క్యాప్షన్గా “యాక్షన్ సన్నివేశాలు పూర్తైతే మనం ఫైట్ మాస్టర్కి గన్ను ఎక్కు పెట్టాలి. సూర్య వంశీ టీం గోల్డెన్ హెడ్ ఉన్న పెద్ద మనిషిపై అమితమైన ప్రేమని చూపిస్తుంది” అని పోస్ట్ చేశారు అక్షయ్. “సూర్యవంశీ” చిత్రంలో అక్షయ్ కుమార్ ఏటీఎస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. 2019 లో “కేసరి” చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అక్షయ్. ప్రస్తుతం ఆయన లక్ష్మీ బాంబ్, మిషన్ మంగళ్, హౌస్ ఫుల్, గుడ్ న్యూస్ తదితర సినిమాలతో బిజీగా ఉన్నారు.
previous post