telugu navyamedia
రాజకీయ వార్తలు

విద్యార్థుల పట్ల బీజేపీ అమానుషంగా ప్రవర్తిస్తోంది: అఖిలేశ్

Akhilesh Yadav

నీట్, జేఈఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నిన్న కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ సింగ్ యాదవ్ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.

విద్యార్థుల పట్ల బీజేపీ అమానుషంగా ప్రవర్తిస్తోందని ఆయన మండిపడ్డారు. ‘జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహించే విషయంలో బీజేపీ మొండి వైఖరితో ముందుకు సాగుతోంది. మానవ వనరుల శాఖ పేరును బీజేపీ ఎందుకు మార్చిందో ఇప్పుడు అర్థమవుతోందని విమర్శించారు.

Related posts