ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ మహిళా నేత అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ నాయుడుకు బెయిల్ మంజూరైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలింగ్ జరుగుతున్న సమయంలో జరిగిన ఘర్షణలో భార్గవ్ రామ్ పై కేసు నమోదైంది. అలాగే ఇటీవల ఓ క్రషర్ వివాదమై భార్గవ్ రామ్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ రెండు కేసుల్లోనూ ఆయనపై వారంట్లు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ కోర్టుకు భార్గవ్ రామ్ హాజరు కావడంతో న్యాయమూర్తి రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేశారు.