కేంద్రప్రభుత్వం జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్కు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించింది. దేశ భద్రత కోసం ధోవల్ చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించింది. అజిత్ ధోవల్ను మరో అయిదేళ్ల పాటు పొడగిస్తున్నట్లు ఇవాళ ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ కార్యాలయానికి ఇవాళ ధోవల్ వచ్చారు.
2014లో జాతీయ భద్రతా సలహాదారుగా ధోవల్ బాధ్యతలు స్వీకరించారు. 2016లో సర్జికల్ స్ట్రయిక్స్తో పాటు ఈ ఏడాది బాలాకోట్ దాడులు కూడా ధోవల్ నేతృత్వంలో జరిగాయి. 1968 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ధోవల్ ఎక్కువ శాతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేశారు. పాక్లో ఆరేళ్లు ఉన్నారు . 1988లో కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై నాగబాబు కామెంట్స్