మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం “పొన్నియన్ సెల్వన్” చిత్రంలో నటిస్తోంది. మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హిస్టారికల్ ఫిక్షన్ నవల ఆధారంగా చోళ సామ్రాజ్యాన్ని కూలదోయడంలో కీలక పాత్ర వహించిన నందిని జీవితం చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆమె భర్త పెరియ పళువెట్టరయ్యర్ పాత్రను శరత్కుమార్ చేస్తున్నాడు. రూ. 500 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
లేటెస్ట్గా ఈ నుంచి ఐశ్వర్యారాయ్ ఫొటో ఒకటి ఆన్లైన్లో లీకై, వైరల్గా మారింది. ఈ పిక్ లో ఐశ్వర్య ఎరుపు రంగు పట్టు చీర, భారీ బంగారు ఆభరణాలను ధరించింది. ఈ లుక్లో ఐశ్వర్య రాణిలాగా కన్పిస్తోంది. ఇందులో ఐశ్వర్యారాయ్ నందిని, మందాకినీ దేవి అనే డబుల్ రోల్ పోషిస్తుంది. ఈ షెడ్యూల్లో విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ప్రకాశ్రాజ్ లాంటి పేరుపొందిన తారలు ఉండడంతో సినిమాపై ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు. ఈ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.
అంతేకాకుండా ఈ సినిమాలో కొన్ని వారాలుగా ఐశ్వర్య ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్లో పాల్గొంటున్నారు. జూలైలో పాండిచ్చేరిలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్లో నటించారు. మధ్యప్రదేశ్లోని ఒర్ఛాలో షెడ్యూల్ ఇటీవలై మొదలైంది. గతంలో ఐశ్వర్య, మణిరత్నం కాంబినేషన్ లో రావణ్, గురు హిట్లు అందించారు. ముచ్చటగా మూడోసారి “పొన్నియన్ సెల్వన్”తో చాలాకాలం గ్యాప్ తరు వాత సౌత్ స్క్రీన్స్ పై మెరవబోతుంది.
కాగా ..ఇటీవల కాలంలో ఐష్ డ్రెస్సింగ్ సెన్స్ బాగా మారిపోయింది. బయట కనిపించినప్పుడల్లా సెన్సిబుల్ గా డ్రెస్ చేసుకుంటోంది. దీంతో ఆమె గర్భవతి అంటూ పుకార్లు చేస్తున్నాయి. ఈ విషయంపై ఐష్ గానీ, ఆమె కుటుంబం గానీ ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆమె నటిస్తున్న తాజా సినిమాకు సంబంధించిన పిక్ లీక్ కావడం చర్చనీయాంశంగా మారాయి.
ఆర్టికల్ 370 అప్రజాస్వామికం అంటున్న విజయ్ సేతుపతి