telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆసుపత్రిలో ఐశ్వర్యారాయ్… స్వల్ప కరోనా లక్షణాలు

Aishwaryarai daughter corona

బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ఆస్పత్రిలో చేరారు. ఐశ్యర్వతో పాటు ఆమె కుమార్తె ఆరాధ్యను కూడా శుక్రవారం (జులై 17) రాత్రి ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్పించారు. గత ఆదివారం అమితాబ‌చ్చన్ కుటుంబంలో ఆయ‌న స‌తీమ‌ణి జ‌యాబచ్చన్ మిన‌హా మిగ‌తా అంద‌రికీ క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఐశ్వర్యకు తొలిసారి చేసిన పరీక్షలో నెగటివ్‌గా తేలగా, జూలై 12న రెండోసారి నిర్వహించిన పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కుమార్తె ఆరాధ్యకు కూడా పాజిటివ్‌గా తేలింది. నాటి నుంచి తల్లీకూతుళ్లు గృహ నిర్భందంలో ఉన్నారు. 46 ఏళ్ల ఐశ్వర్యారాయ్‌కి కొవిడ్ పాజిటివ్‌గా తేలినప్పటికీ ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. అయితే.. శుక్రవారం స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు నానావతి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించాయి. ఐశ్వర్యారాయ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఐశ్యర్యారాయ్ భర్త అభిషేక్ బచ్చన్, మామ అమితాబ్ బచ్చన్ కూడా అదే ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నారు.

Related posts