కరోనా కారణంగా దాదాపు నాలుగు నెలలుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు నేడు పున: ప్రారంభం కానున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ దేశాల నుంచి మన దేశానికి పాక్షికంగా విమానాలు నడవనున్నాయి. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్లైన్స్ ఈ నెల 17-31 మధ్య 18 విమానాలను నడపనుంది.
ఢిల్లీ-న్యూయార్క్ మధ్య ప్రతి రోజూ, ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడు రోజులు విమానాలు నడపనున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఢిల్లీ, లండన్ మధ్య రోజుకు రెండు విమానాలు నడిపేందుకు బ్రిటన్తో ఒప్పందం చేసుకోనున్నట్టు మంత్రి తెలిపారు. జర్మనీకి చెందిన ఎయిర్ లుఫ్తాన్సాతో దాదాపు ఒప్పందం పూర్తయిందని మంత్రి పూరి వివరించారు.ఈ నెల 18 నుంచి ఆగస్టు 1 మధ్య ఎయిర్ ఫ్రాన్స్ కు చెందిన 28 విమానాలు నడవనున్నాయి.
అన్ని ప్రాంతాలకు పులివెందుల గ్యాంగులు: బుచ్చయ్య చౌదరి