telugu navyamedia
వార్తలు సామాజిక

రాబోయే రోజుల్లో కరోనా ఉద్ధృతి తీవ్రం: ఎయిమ్స్ డైరెక్టర్

corona

దేశలో కరోనా కేసులు రోజురోజుకూ ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు వారాల కిందటి వరకు రోజుకు వెయ్యి కేసులు నమోదవుతుండగా, ఇప్పుడు రోజుకు 3 వేల కేసుల వరకు బయటపడుతున్నాయి. ఈ పరిణామాలపై ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. జూన్, జూలై మాసాల్లో దేశంలో కరోనా పతాకస్థాయికి చేరే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. అంచనాల ప్రకారం పెరుగుతున్న కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో కరోనా ఉద్ధృతి తీవ్రమతుందని అన్నారు.

ఈ పెరుగుదలపై వివిధ అంశాలు ప్రభావం చూపే అవకాశముందని, అవి ఎంతమేర ప్రభావం చూపిస్తాయన్నది కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. లాక్ డౌన్ పొడిగింపు ప్రభావం ఎంతనేది కూడా మరికొన్ని రోజులు గడిస్తే కానీ చెప్పలేమని వివరించారు. భారత్ లో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 52 వేలు దాటింది. దేశవ్యాప్తంగా 1,783 మరణాలు సంభవించాయి. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 35,902 కు చేరింది.

Related posts