ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్ల క్రితం అరెస్ట్ అయిన శశికళ ఇటీవలే జైలు నుంచి రిలీజై బెంగళూరులో ఉన్నారు. ఫిబ్రవరి 7 వ తేదీన బెంగళూరు నుంచి ఆమె చెన్నైకి రాబోతున్నారు. తమిళనాడులోకి అడుగుపెట్టిన తరువాత ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు టీవీవీ దినకరన్ పార్టీ ఏర్పాట్లు చేసింది. వెయ్యికార్లతో ఆమెకు చెన్నై వరకు స్వగతం పలకాలని నిర్ణయించారు. అయితే, జనవరి 27 వ తేదీన బెంగళూరులోకి విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక జయలలితకు చెందిన లగ్జరీ కారులో ప్రయాణం చేశారు. ఆ కారుపై అన్నాడీఎంకే జెండా ఉన్నది. దీనిపై అన్నాడీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీతో సంబంధంలేని వ్యక్తులు పార్టీకి సంబంధించిన జెండాతో ఉన్న కారులో ప్రయాణం చేయడం నేరం అని, దీనిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఒకవేళ శశికళ అన్నాడీఎంకే జెండాతో ఉన్న కారుతో తమిళనాడులోకి ప్రవేశిస్తే ఆమెను పోలీసులు అడ్డుకునే అవకాశం ఉన్నది. జెండాను తొలగించకుంటే అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post