telugu navyamedia
సినిమా వార్తలు

“ఎవరు” బిగ్గెస్ట్ స‌క్సెస్… బాలీవుడ్‌ క్రిటిక్స్ కూడా… : అడివి శేష్

Evaru

ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్‌పై వెంక‌ట్ రామ్‌జీ దర్శకత్వంలో అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో రూపొందిన థ్రిల్లర్ “ఎవరు”. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లుగా వ్యవహరించారు. ఆగస్ట్ 15న సినిమా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా నాలుగో వారంలోకి అడుగు పెడుతుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అడివిశేష్, న‌వీన్ చంద్ర‌, వంశీ ప‌చ్చిపులుసుల‌, శ్రీచ‌ర‌ణ్ పాకాల త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ “గూఢ‌చారి” లైఫ్ టైమ్ కలెక్ష‌న్స్‌ను చాలా చోట్ల “ఎవ‌రు” క్రాస్ చేసింద‌ని తెలిసింది. నేను చేసిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ హిట్‌. సినిమా మూడో వారంలో కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. బుక్ మై షోలో కూడా ఇంకా బుకింగ్స్ అవుతున్నాయి. “మేజ‌ర్‌” సినిమాను మహేష్ బాబుగారి బ్యాన‌ర్‌తో క‌లిసి కో ప్రొడ్యూస్ చేస్తున్న సోనీ పిక్చ‌ర్స్ ఎవ‌రు సినిమాను బాలీవుడ్‌లో పెద్ద క్రిటిక్స్ స‌హా చాలా మందికి చూపించారు. ప్ర‌తి ఒక్క‌రూ సినిమాను ఎంజాయ్ చేశారు. “ఇన్విజ‌బుల్ గెస్ట్‌”, “బ‌ద్లా” సినిమా చూశాం. కానీ మీరు వాటికి డిఫ‌రెంట్‌గా, ఫ్రెష్‌గా ఈ సినిమా చేశామ‌ని అంద‌రూ అప్రిషియేట్ చేశారు. “బ‌ద్లా” సినిమా చూసిన వారికి కూడా ఎవ‌రు సినిమా బాగా న‌చ్చింది. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సినిమా నాలుగో వారంలోకి సినిమా ఎంట‌ర్ అవుతుంది. సినిమా స్క్రీన్స్ కూడా పెర‌గుతుండ‌టం విశేషం. నాలుగు వారాల సినిమా అని డిస్ట్రిబ్యూట‌ర్స్ అన్నారు. కానీ ఇప్పుడు సినిమా నాలుగు వారాల‌ను కూడా దాట‌బోతుందని వారే అనుకుంటున్నారు. నా కెరీర్ బిగ్గెస్ట్ స‌క్సెస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

Related posts