అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మేజర్’.. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ఇది.
సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా… కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది.
శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం తెలుగుతోపాటు, హిందీ, మలయాళ భాషల్లో జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఓ వీడియో రూపంలో మే 9న ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు
హీరో మహేష్బాబు సొంత సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోసీ పిక్చర్స్ ఇండియా సంస్థ నిర్మించింది.
కాగా, మేజర్ సందీప్ బాల్యం, యవ్వనంతోపాటు భారతసైన్యంలో ఆయన అనుభవాలు, ముంబయి దాడుల ఘటనలో చేసిన సహసాలు, త్యాగం వరకు ఆయన జీవితానికి సంబంధించిన విభిన్న కోణాల్ని ఈ చిత్రంలో చూపనున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్య క్రమాలు జరుగుతున్నాయి.
అడివి శేష్ స్వయంగా నిర్మాణానంతర పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చారు.