telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆదిపురుష్’​ నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌..

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న సినిమా ‘ఆదిపురుష్‌’. . ప్రభాస్ సరసన హీరోయిన్ గా కృతిసనన్ నటిస్తుండగా.. విలన్ సైఫ్ అలీ ఖాన్ తో పాటు మరో ఇద్దరు బాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు .

రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రను పోషించగా.. జానకిగా కృతిసనన్‌ నటించింది. లంకేశ్వరుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించారు.

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ కి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. దీన్ని వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ గా మరో సినిమా తీసుకొచ్చేందుకు ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ప్లాన్ చేస్తున్న‌ట్లు టాక్‌ వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ ఆలోచన ప్రభాస్‌తో పంచుకోగా.. ఆయన సానుకూలంగా స్పందించారని టాక్‌. అన్నీ అనుకున్నట్లు కుదిరితే వచ్చే ఏడాదే ఈ సీక్వెల్‌ను పట్టాలెక్కించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’తో పాటు ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాల్లో నటిస్తున్నారు. సందీప్‌ రెడ్డి దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ అనే చిత్రాన్ని ప్రకటించారు. అలాగే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

Related posts