కాంగ్రెస్ పార్టీ బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ కు లోక్ సభ టికెట్ ను ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. ఆమెను ముంబై నుంచి బరిలోకి దింపాలని భావిస్తోంది. ఈ విషయాన్ని పార్టీ నేత ఒకరు వెల్లడించారు. ముంబై నార్త్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలో నిలపాలని కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విషయంలో ఊర్మిళ కుటుంబం ఇంకా స్పందించలేదు.
ఆమె పేరును పార్టీ నాయకత్వం పరిశీలిస్తోందని, తుది నిర్ణయం సాధ్యమైనంత త్వరగా తీసుకుంటామని పార్టీ నేతలు అంటున్నారు. ముంబై పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరుగనుంది. ఒకవేళ ఊర్మిళకు టికెట్ లభిస్తే, ఆమె బీజేపీ నేత ఎంపీ గోపాల్ శెట్టిపై పోటీ చేయాల్సి వస్తుంది.
ప్రజావేదికను కూల్చి వేస్తే ప్రజాధనం దుర్వినియోగం: కేశినేని నాని