telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మొరిగే కుక్కలు ప్రతిచోటా ఉంటాయి రోజా గారూ… నువ్వేనా శ్రీరెడ్డి…

srireddy

పుత్తూరులోని సుందరయ్య నగర్‌లో బోరు బావి ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే రోజాకు అక్కడి స్థానిక మహిళలు పూల స్వాగతం పలికారు. రోజా నడుస్తూ ఉంటే చాలా మంది మహిళలు ఆమె కాళ్లపై పూలు జల్లుతూ అభిమానాన్ని చూపించారు. అయితే రోజా లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ఆమెపై సోషల్ మీడియా లో విరుచుకుపడుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ.. పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ తాట తీస్తానని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ బాబు, చంద్రబాబులకు చురకలేశారు. మొత్తానికి ఈ ఇష్యూ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుండగా.మధ్యలో వైల్డ్ ఎంట్రీ ఇచ్చేశారు వివాదాస్పద నటి శ్రీరెడ్డి. ‘రోజా గారూ మీరు పేద ప్రజలకు మంచి మంచి పనులు చేస్తున్నారు. ధైర్యంగా ముందుకు వెళ్లండి మొరిగే కుక్కలు ప్రతిచోటా ఉంటాయి.. అధైర్య పడకండి.. మీరు ఒంటరి కాదు. మీకు సపోర్ట్‌గా మేం ఉన్నాం’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఇది ఇలావుంటే అప్పట్లో దర్శకుడు బోయపాటి శ్రీనుతో నటి, ప్రముఖ టీవీ ఎంటర్ టైన్మెంట్ ప్రొడక్షన్ నిర్వాహకురాలుకి సంబంధాలు ఉన్నాయని సంచలన కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి.. ఆ నటి భర్తతో రోజాకి ఏవో పాత వ్యవహారాలు ఉన్నాయంటూ అప్పట్లో ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టి అగ్గిరాజేసింది. ఈ సినిమావాళ్లు, రాజకీయనాయకులు ఎప్పుడు శత్రువులుగా మారుతారో ఎప్పుడు మిత్రులుగా మారుతారో ఎవ్వరికీ అర్థంకాదు.

Related posts