టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధాధున్ రీమేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ సినిమాలో టబు పోషించిన పాత్ర కోసం ఎవ్వరూ సెట్ అవ్వడం లేదు. నితిన్ సొంత బ్యానర్లో రూపొందనున్న ఈ చిత్రంలో స్టార్ నటీనటులనే తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒరిజినల్లో చేసిన టబునే ముందు సంప్రదించగా.. ఆమె బిజీగా ఉండటం వల్ల నో చెప్పేసింది. ఆ తర్వాత ఈ పాత్ర కోసం ఇద్దరు ముగ్గురిని అనుకున్న టీమ్.. చివరికి నయనతారను తీసుకోవాలని ఫిక్సై, ఆమెను సంప్రదించగా.. ఈ రీమేక్లో చేసేందుకు ఆమె అక్షరాలా రూ. 4 కోట్లు డిమాండ్ చేసిందని అంటున్నారు. మరి నయన్ అడిగినంత పారితోషికం ఇస్తారా లేదా అనేది చూడాలి.
previous post
next post