కరోనా ఎఫెక్ట్ తోలాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాకే పరిమితం అయ్యారు. సినిమా, సీరియళ్ళ షూటింగులు కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సెలెబ్రిటీలందరూ ఈ లాక్ డౌన్ టైంలో ఎలా గడుపుతున్నారో సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు తెలియజేస్తున్నారు. కొంతమంది వంటలు నేర్చుకుంటుంటే… మరికొంతమంది వర్కౌట్స్ చేస్తున్నారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం తనకు ఎంతో ఇష్టమైన పోల్ డ్యాన్స్ను చాలా మిస్సవుతున్నా అంటున్నారు. బాలీవుడ్ నటి కృతి కర్భందా తెలుగులో భోణి, తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఓం త్రీడి, బ్రూస్లీ, ఒంగోలు గిత్త చిత్రాల్లో నటించింది. ఈ బ్యూటీ ప్రస్తుతం తన ప్రియుడైన పుల్కిత్ సామ్రాట్తో డేటింగ్ లో ఉంది. ముంబైలో ఉంటున్న వీరు ఈ లాక్డౌన్ సమయంలో ఏం చేస్తున్నారో తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. తాజాగా కృతి తన ఇన్స్టాగ్రామ్లో పోల్ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి షేర్ చేసింది. “లాక్డౌన్ కారణంగా నాకు ఇష్టమైన పోల్ డ్యాన్స్ను మిస్సవుతున్నా. ఈ సమయంలో మా ఇంట్లో పోల్ ఉంటే బాగుండేది. రోజూ నాకు నచ్చినంత సేపు పోల్ డ్యాన్స్ చేసుకునేదాన్ని. లాక్డౌన్ తర్వాత పోల్ డ్యాన్స్ను చేయాలని అనుకుంటున్నా. నాలాగే మీరు ఏదైనా ఫేవరెట్ ఆటను మిస్సయితే షేర్ చేసుకోండి” అంటూ కృతి పేర్కొంది.
previous post