telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్‌ టాప్ హీరోలతో ఛాన్స్ కొట్టేసిన కియారా..!

kira-adwani

‘కబీర్ సింగ్‌’తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కియారా అడ్వాణీ. తెలుగులో తక్కువ సినిమాలే చేసినా బాగానే పేరు తెచ్చుకుంది. సూపర్ స్టార్ మహేష్ హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’, చెర్రీతో ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా కియారా టాలీవుడ్‌లో మూడు సినిమాల్లో నటించబోతుందంటూ ప్రచారం సాగుతోంది. అవి ఏంటంటే.. ప్రభాస్-నాగ్ అశ్విన్, ఎన్టీఆర్-త్రివిక్రమ్, మహేష్-పరుశురామ్ ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో హీరోయిన్ రోల్ కోసం కియారాతో చర్చలు జరుపుతున్నాయి సదరు చిత్ర బృందాలు. అయితే మరి వీటిల్లో వేటికి కియారా ఓకే చెబుతుందో చూడాలి. ఇప్పటికే ఆమెతో దర్శక, నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

Related posts