telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మనం పీకేదేమీ లేదక్కడ… హౌస్‌లో నేను ప్రత్యక్షంగా చూశాను : బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్చన

Archana

హీరోయిన్ అర్చన సినిమా అవకాశాలు తగ్గుతున్న తరుణంలోనే బుల్లితెర పాపులారిటీ షో బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ప్రముఖ హెల్త్ కేర్ కంపెనీ అధ్యక్షుడిగా ఉన్న జగదీష్ భక్తవచ్చలమ్ అనే వ్యక్తి పెళ్లి చేసుకొని ఓ ఇంటిదైపోయింది. బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొన్న అర్చన తాజా ఇంటర్వ్యూలో ఆ సంగతులను పంచుకుంది. అర్చన మాట్లాడుతూ.. ”బిగ్ బాస్ హౌస్‌లో విభిన్న స్వభావాలున్న వ్యక్తులను కంటిస్టెంట్లుగా తీసుకున్నారు. అయితే వారంతా ఒకరిపై ఒకరు దురుసుగా కామెంట్స్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళను తొక్కేయాలని, హౌస్ నుంచి బయటకు పంపించేయాలని చూస్తుంటారు. కానీ వారికి తెలియని విషయం ఒక్కటే. ఎవరైతే పక్కోడిని తక్కువ చేస్తూ మాట్లాడతారో వాళ్ళే చులకన అవుతారు. మనం పీకేదేమీ లేదక్కడ.. ఆడియన్స్ ఓటేస్తే గెలుస్తాం. ఈ సింపుల్ లాజిక్ అర్థం చేసుకోవడంలో కొందరు విఫలమవుతుంటారు. ఇవన్నీ హౌస్‌లో నేను ప్రత్యక్షంగా చూశాను” అని చెప్పింది. కాగా అదే బిగ్ బాస్ హౌస్‌లో కొందరు లవ్లీ పీపుల్‌ని కూడా కలిశానని అర్చన పేర్కొంది. అయితే బిగ్ బాస్ హౌస్‌కి వెళ్ళాక.. మనం ఎవ్వరినీ హర్ట్ చేయకుండా, మనల్ని హర్ట్ చేసిన వాళ్ళను మాత్రం అస్సలు వదలొద్దనేది పక్కాగా నేర్చుకున్నానని చెప్పింది అర్చన.

Related posts