సినీ నటుడు శివాజీ టీవీ9 షేర్ల వివాదానికి సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ శివాజీ నేడు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏబీసీఎల్ 40వేల షేర్ల కొనుగోలు కోసం రవిప్రకాశ్కు గత సంవత్సరం ఫిబ్రవరి 19న రూ.20లక్షలు బ్యాంకు ద్వారా చెల్లించానని..అయితే ఎన్సీఎల్టీలో వివాదం తర్వాత షేర్లు బదిలీ చేస్తానని రవిప్రకాశ్ చెప్పారని శివాజీ పేర్కొన్నారు.
రవిప్రకాశ్తో లావాదేవీలు కుట్ర పూరితమని వచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు తనపై కేసు నమోదు చేశారని శివాజీ తెలిపారు. కనీసం విచారణ జరపకుండా పోలీసులు కేసు నమోదు చేశారని..తనపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని శివాజీ కోరారు.