నేతాజీ సుభాష్ చంద్రబోస్, మంత్రి నారాలోకేశ్ ఇద్దరూ ఒకే రోజు పుట్టడం సంతోషకరమని సినీనటి దివ్యవాణి అన్నారు. పుట్టినరోజున కూడా రాష్ట్రం కోసం లోకేశ్ స్విట్జర్లాండ్లోని దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్నారని ఆమె ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పొందిన స్ఫూర్తికి ఇది నిదర్శనమన్నారు.
చిన్న వయస్సులో నిత్యం కష్టపడుతున్న లోకేష్పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటని దివ్యవాణి చెప్పారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అభినందనీయమని, అన్ని వర్గాలకు సంక్షేమ పధకాలు అద్భుతంగా కొనసాగుతున్నాయని, చంద్రబాబు లాంటి నేత మనకు దొరకడం అదృష్టమని దివ్యవాణి తెలిపారు. మరోసారి చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు.
రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుంది: కన్నా