telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ లో విషాదం..కరోనాతో నటి మృతి

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ ఎవరినీ వదలడం లేదు. సాధార‌ణ ప్ర‌జ‌లు అయినా స‌రే.. ప్ర‌ధాని అయినా స‌రే.. ప్ర‌జాప్ర‌తినిధి అయినా స‌రే.. అధికారి అయినా స‌రే దానికి మాత్రం ఏ మాత్రం వివ‌క్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్ప‌టికే ఎంతోమంది ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనాబారిన ప‌డ్డారు.. తాజాగా టీవీ ప్రముఖ నటి కరోనాతో ఇవాళ ఉదయం మృతి చెందింది. టీవీ నటి దివ్యా భట్నాగర్‌ సోమవారం ఉదయం కరోనాతో ముంబైలోని సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో మరణించింది. వారం రోజుల కింద నటి దివ్యా భట్నాగర్‌ కు కరోనా పాజిటివ్‌ అని పరీక్షల్లో తేలడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. హైబీపీ సమస్యతో బాధపడుతున్న దివ్యాభట్నాగర్‌కు కరోనా సోకి గత నెల ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అధిక రక్తపోటుతో పాటు నిమోనియాతో బాధపడుతున్న దివ్యాను వైద్యులు వెంటిలేటరుపై ఉంచి చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆమె ఇవాళ మృతి చెందింది.

Related posts