*సీఎం జగన్తో సతీసమేతంగా ఆలీ భేటి..
*త్వరలో గుడ్న్యూస్ ఉంటుందని సీఎం జగన్ చెప్పారు.- అలీ
*ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చాం – అలీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రముఖ నటుడు అలీ కుటుంబ సమేతంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్తో అలీ భేటీ అయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ను కలిశాను. అతిత్వరలో పార్టీ ఆఫీస్ నుండి శుభవార్త వస్తుందని అన్నారు… అయితే ఏమిస్తారో తనకు చెప్పలేదన్నారు. నేనెప్పుడు పదవులు ఆశించకుండా పార్టీ కోసం పని చేశానని అలీ పేర్కొన్నారు. ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అవ్వక ముందు నుంచి ఆ ఫ్యామిలీతో పరిచయం ఉంది..అదే పరిచయం జగన్ గారితో కంటిన్యూ అవుతుందని ఆలీ చెప్పారు.
గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని జగన్ అన్నారని… అయితే టైం తక్కువ ఉండడంతో తానే వద్దని తిరస్కరించినట్లు అలీ తెలిపారు. ఎమ్మెల్యే అంటే గ్రౌండ్ నుండి వర్క్ చెయ్యాలి… ఫేస్ వ్యాల్యూ బట్టి అవ్వదని అన్నారు. అయితే ఈరోజు మాత్రం సీఎంతో భేటీ పూర్తిగా వ్యక్తిగతమని నటుడు అలీ తెలిపారు. ‘
సినీ ప్రముఖులని అవమాన పరచాల్సిన అవసరం జగన్ కి ఏముందని, సినీ ప్రముఖులకు ఇవ్వాల్సిన గౌరవం సీఎం జగన్ ఇస్తున్నారని, గౌరవం ఇవ్వలేదని కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇక సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నా. సామాన్యులకు కూడా సినిమా టికెట్ అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచన. చిన్న సినిమాకు కూడా లాభం ఉండాలన్నదే మా ఉద్దేశం అని అలీ అన్నారు.
అయితే.. అలీకి రాజ్యసభ సీటును ఇస్తున్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో వీరి భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.