ఇటీవల బిగ్బీ అనారోగ్యానికి గురయ్యారని, అమితాబ్ బచ్చన్కు గాయం అవ్వడం వల్ల ఆసుపత్రిలో చేరారని సోమవారం నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శనివారం నుంచి ఆస్పత్రిలోనే ఉన్నట్లు, ప్రస్తుతం చికిత్స తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయం తెలియడంతో బిగ్ బి అభిమానులు ఆందోళన చెందారు. అయితే బచ్చన్ కుంటుంబం మాత్రం అయితే దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా తండ్రి ఆరోగ్యంపై ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ స్పందించారు. బిగ్బీ అమితాబ్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.. “నేను కూడా అడుగతాను. ఎందుకంటే నాన్న నా ముందే కూర్చొని ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్నది ఖచ్చితంగా నాన్న డూప్లికేట్ అయ్యి ఉంటారు” అని పేర్కొన్నారు. కాగా జులైలో అమితాబ్ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బిగ్బీతోపాటు, అభిషేక్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్య కరోనా పాటిజివ్గా తేలి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. 20 రోజుల చికిత్స అనంతరం మెల్లమెల్లగా అందరూ కోలుకున్నారు. కాగా అభిషేక్ నటించిన ‘బిగ్బుల్’ విడుదలకు సిద్ధంగా ఉంది.
previous post
next post