telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అసురన్” రీమేక్ తో స్టార్ వారసుడి ఎంట్రీ… దగ్గుబాటి “మనం”…!?

Venkatesh

విక్టరీ వెంకటేష్ ఇప్పుడు “వెంకీ మామ” చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా త‌ర్వాత తమిళంలో సూపర్ హిట్ అయిన “అసురన్” సినిమాని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. అసుర‌న్ చిత్రం వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్‌, మంజు వారియ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రీమేక్ ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో క‌థానాయిక‌గా శ్రియ‌ని ఎంపిక చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. అయితే తమిళ్‌లో ధనుష్‌ రెండు వేరియేషన్స్‌లో కనిపించాడు. అయితే తెలుగులో వెంకీ రెండు లుక్స్‌లో కనిపిస్తాడా లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తండ్రి పాత్రలో వెంకీ నటిస్తుండగా కొడుకు పాత్రలో ఓ స్టార్ వారసుడు ఇంట్రడ్యూస్‌ అవుతున్నాడు. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో వారసుడ్ని వెండితెరకు పరిచయం చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు, రానా తమ్ముడు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేయాలని చాలా రోజులగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో వంశీ దర్శకత్వంలో లేడీస్‌ టైలర్‌ సీక్వెల్‌తో అభిరామ్‌ డెబ్యూ ఉంటుందన్న ప్రచారం గట్టిగా జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్‌ సుమంత్ అశ్విన్‌ చేతికి వెళ్లింది. తాజాగా అభిరామ్‌ తెరంగేట్రానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అసురన్‌ రీమేక్‌తోనే అభిరామ్‌ వెండితెరకు పరిచయం కానున్నడట. అంతేకాదు ఈ సినిమాలో వెంకీ ఇద్దరు పిల్లలకు తండ్రిగా నటించనున్నాడు. ఒక కొడుకుగా అభిరామ్‌ నటిస్తుండగా మరో కొడుకుగా వెంకీ వారసుడు అర్జున్‌ నటిస్తున్నాడు. వెంకీతో పాటు ఇద్దరు వారసులు కలిసి నటిస్తుండటంతో ఆ సినిమా దగ్గుబాటి మనం అవుతుందా ? అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

Related posts