telugu navyamedia
క్రీడలు వార్తలు

టీ20 ప్రపంచ కప్ లో డివిలియర్స్…?

టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున ఏబీ డివిలియర్స్ ఆడటానికి ఆ దేశ క్రికెట్ బోర్డు సూచనప్రాయంగా అంగీకరించింది. ఏబీ డివిలియర్స్ పునరాగమనానికి అంగీకరిస్తే.. జట్టులో అతని స్థానం సుస్థిరమౌతుందనే సంకేతాలను పంపించింది. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై అతనితో తాను సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆలోచనలను ఏబీతో పంచుకున్నానని చెప్పారు. ఐపీఎల్ టోర్నమెంట్లలో అతని పెర్‌ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటోందని, అందుకే- రిటైర్ అయినప్పటికీ- జట్టులో చోటు కల్పించాలని బోర్డు భావిస్తున్నట్లు తెలిపారు. జాతీయ జట్టు తరఫున ఆడటానికి డివిలియర్స్ అంగీకరిస్తే.. అతనికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. టీ20 ప్రపంచ కప్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించబోతోన్న టోర్నీ ఇది. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పపువా న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ జట్లు పాల్గొననున్నాయి.

Related posts