telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మా సిబ్బందిని బీజేపీ వారు బెదిరించారు ; ఆమ్ ఆద్మీ పార్టీ నేత

ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చడ్డా మాట్లాడుతూ… ఢిల్లీ జల్‌దల్ బోర్డు ఆఫీసులో బీజేపీ వారు విధ్వంసం చేశారని అన్నారు. అంతేకాకుండా ఆఫీసు సిబ్బందిని బెదిరించారని కూడా తెలిపారు. దీనికి సంబంధించి నేడు ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు కూడా ఆయన అన్నారు. ఢిల్లీ జల్‌దల్ బోర్డు ఆఫీసులో జరిగిన విధ్వంసంకు సంబంధించిన వీడియోను రాఘవ్ తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ‘ఢిల్లీ జల్‌దల్ బోర్డు కార్యాలయంలో బీజేపీ రౌడీలు విధ్వంసం సృంష్టించారు. పూర్తి కార్యాలయ్యాన్ని ద్వంసం చేశార’ని రాఘవ్ తన ట్వీట్‌లో తెలిపారు. అంతేకాకుండా దీనిపై తాను ప్రెస్ మీట్ పెడతానని, దీనిని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహిస్తానని, బీజేపీ దాడి వెనుక ఉన్న అసలు నిజం తెలుసుకునేందుకు ఈ సమావేశం పెట్టనున్నట్లు మరో సంబంధిత ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై పలువురు ఆప్ నేతలు మాట్లాడారు. ‘దేశ రాజధానిలో ఇదే తరహా గూండాయిజం. మొదట సీఎంను హౌస్ అరెస్ట్ చేశారు. తరవాత మళ్లీ ఇప్పుడు కార్యాలపై పడి దాడులకు దిగుతున్నారు. అయితే ఎన్నికల్లో జరిగిన పరాజయాన్ని మరువలేక అమిత్ షా ఇలా చేస్తున్నాడ’ని ఆప్ నేత సంజయ్ సింగ్ అన్నారు. చూడాలి మరి బీజేపీ దీని పై ఏ విధంగా స్పందిస్తుంది అనేది.

Related posts