మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రస్తుతం సక్సెస్ ఫుల్గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 11న ఈ చిత్రం విడుదల కాగా, ప్రపంచ వ్యాప్తంగా చిత్రం రూ.105.56 కోట్ల షేర్ రాబట్టి ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డ్ నెలకొల్పింది. అయితే చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న టీం తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్ విత్ ఎమ్బి’ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సితార, ఆద్య అడిగిన ప్రశ్నలకి మహేష్ సమాధానమిచ్చాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మహేష్ బాబు తనయ సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య ఏ అండ్ ఎస్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఛానెల్లో అనేక ఆసక్తికర అంశాలని వివరించడంతో పాటు అడపాదడపా సెలబ్రిటీలతో కలిసి సందడి చేస్తుంటారు. ఇటీవల రష్మికతో కలిసి రచ్చ చేసిన ఈ చిన్నారులు ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి సందడి చేశారు.
previous post
next post
పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి సెటైరికల్ పోస్ట్