యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి టీజర్ చూస్తే..ఆడవాళ్ళ మధ్యలో పెరిగిన ఓ అబ్బాయి పెళ్లికోసం పడే పాట్లను దర్శకుడు అందంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
తాజాగా నేడు ప్రేమికుల రోజును పురస్కరించుకొని సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ఓ మై ఆద్యా అంటూ సాగే ఈ ప్రేమ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. శర్వా – రష్మిక జంట మధ్య కెమిస్ట్రీ ఫ్రెష్ ఫీల్ ని తెస్తోంది.
ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తూ.. చిత్ర బృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది.
ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన థియేటర్లకు తీసుకురానున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో.. రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి ముఖ్యమైన పాత్రలను పోషించారు.