telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వచ్చే ఏడాది వేసవిలో ఏఏ21…

AA21

ప్రస్తుతం స్టార్ దర్శకులతో సినిమాలు ఓకే చేసి మంచి లైనప్‌ను కనబరుస్తున్నారు అల్లు అర్జున్ . ప్రస్తుతం అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్వకత్వంలో పాన్ ఇండియా రేంజ్‌లో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో లక్కీ బ్యూటీ రష్మిక మందాన హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని కొరటాల శివతో చేయనున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమా మిర్చితో తెలుగు పరిశ్రమకు పరిచయం అయిన దర్శకుడు కొరటాల శివ. కొరటాల శివ, అల్ల అర్జున్ కాంబోలో రానున్న సినిమా పొలిటికల్ డ్రామాలో తెరకెక్కనుందన్న వార్తలు ఇప్పటికే చాలా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఏఏ21 సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇటీవల ప్రారంభించారంట. అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామంటూ మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో.. ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి మరి.

Related posts