telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

లోయలో పడ్డ బస్సు… 8 మృతి, 39 గాయాలు..

Bus Accident

ఈరోజు జమ్మూకశ్మీర్ లోని ఉద్ధంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి సురింగ్సర్ నుంచి శ్రీనగర్ కు వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు మజాల్తా వద్ద లోయలోకి జారిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే చనిపోగా, 39 మందికి గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా, ఈ సందర్భంగా ప్రమాదంలో గాయపడ్డ ఓ ప్రయాణికుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది.

పోలీస్ ఉన్నతాధికారి ఈ విషయమై మాట్లాడుతూ.. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతాబలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలస్యం కాకుండా ఉండేందుకు డ్రైవర్ మరోదారిలో బస్సును మళ్లించాడని అన్నారు. వేగంగా వెళుతున్న బస్సు మజాల్తా ప్రాంతం వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి జారిపోయిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Related posts