telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దేశంలో 78 లక్షల మార్క్‌ దాటిన కరోనా కేసులు..

corona covid

దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. తాజా కేసులతో దేశంలో 78 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 53,370 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 650 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 67,549డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78,14,682 కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 6,80,680 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 70,16,046 కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,17,956 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 89.78శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో “యాక్టివ్” కేసులు 8.71శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.51 శాతానికి మరణాల రేటు తగ్గింది. ఇటు గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 12,69,479కు చేరింది.

Related posts