telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

Road accident 8 dead and 30 injured

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల్లోకి వెళితే ఆదివారం యమునా ఎక్స్‌ప్రెస్‌ వే మీదుగా ఓ కుటుంబం వేగనార్ కారులో నోయిడా నుంచి ఆగ్రా వెళుతుండగా.. అది ఒక్కసారిగా అదుపుతప్పి ఓ ట్రక్కును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరొకరు మరణించారు. గాయాల పాలైన మరో ముగ్గురికి ఆగ్రా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిని ఉత్తరప్రదేశ్ గౌతమ బుద్ధానగర్‌ జిల్లాలోని జేవార్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.

Related posts