భారత్-ఆస్ట్రేలియాల మధ్య ఐదో వన్డేలో భాగంగా ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
నాలుగో వన్డేలో విశ్రాంతి తీసుకున్న రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీకి ఈ వన్డేలో చోటు దక్కింది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, విజయ్శంకర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా.
ఆరోన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్కోంబ్, మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మాక్స్వెల్, ఆస్టన్ టర్నర్, అలెక్స్ కేరీ, జే రిచర్డ్ సన్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, నేథన్ లయన్లు టీమిండియా జట్టుతో తలపడనున్నారు.
ఆరు ఓవర్లు పూర్తి చేసుకున్న ఆసీస్ వికెట్ కోల్పోకుండా 38 పరుగులు చేసింది.