telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్ లో పెరిగిన కరోనా కేసులు…

Covid-19

దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 80 లక్షలకు చేరువయ్యాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. నిన్నటితో పోల్చితే మళ్ళీ కేసులు పెరిగాయి. గడచిన 24 గంటలలో58,439 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 508 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 27,860 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,90,322కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 6,10,803 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 72,59,509కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,20,010 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 90శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో “యాక్టివ్” కేసులు 8.71శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.51 శాతానికి మరణాల రేటు తగ్గింది.

Related posts