రష్యా రాజధాని మాస్కోలో జరిగిన విమాన ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 41కి చేరుకున్నది. మాస్కోలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో సుమారు 78 మంది ఉన్నారు. ఆదివారం మాస్కో నుంచి ముర్మాన్స్కు వెళ్తున్నసుఖోయ్ సూపర్జెట్ 100 టేకాఫ్ తీసుకున్న కాసేపటికే మంటలు చెలరేగాయి. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలోనూ మంటలు మరింత వ్యాప్తి చెందాయి.
టేకాఫ్ తీసుకున్నతర్వాత విమానంపై పిడుగు పడినట్లు కొందరు ప్రయాణికులు చెప్పారు. కానీ విమానయాన సంస్థ మాత్రం సాంకేతిక సమస్య కారణంగా ల్యాండ్ చేసినట్లు వెల్లడించారు. అత్యవసర ల్యాండింగ్ సమయంలో.. విమానం రన్వేను బలంగా ఢీకొట్టింది. దాంతో ఆ విమానం కొంత ఎత్తుకు లేచిపడింది. ఆ తర్వాత ఇంజిన్లు పేలి మంటలు వ్యాపించాయన్నారు.ఈ విమానంలో సిబ్బందితో పాటు 78 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.