telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న 40 స్పీడ్ బోట్లు..

ఏపీ నుంచి హైదరాబాద్ కు స్పీడ్ బోట్లు చేరుకున్నాయి. గత వారం రోజులుగా భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఏపీ, తెలంగాణ టూరిజం కి చెందిన వివిధ పర్యటక ప్రాంతాల నుండి 40 బోట్లు హైదరాబాద్ కు చేరుకున్నాయి. రవీంద్రభారతి నుండి అవసరమైన వరద ప్రభావిత ప్రాంతాలకు బోట్లను తరలిస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వేషాల కారణంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని సాయం కోరారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో సహాయక చర్యల కోసం స్పీడ్ బోట్స్ పంపించాలని ఈరోజు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణా ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు. అయితే కేసీఆర్ వినతికి వెంటనే స్పందించిన జగన్. తెలంగాణ ప్రభుత్వం కోరిన సాయాన్ని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏపీ సీఎంవో ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

Related posts