కోడుమూరు మండలంలోని ఎర్రదొడ్డి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మూడు నెలల పసివాడు ప్రమాదవశాత్తూ బైక్ వెనుక చక్రంలో ఇరుక్కొని మృతి చెందాడు. మరికొద్దిసేపట్లోనే ఇంటికి చేరుకునేవారు..అంతలోనే ప్రమాదం జరిగిపోయింది.
వివరాల్లోకి వెళితే..
అల్వాల మల్లికార్జున, సుభాషిణి దంపతులు మూడు నెలల బాబుకు తీవ్రమైన జ్వరం, జలుబుతో బాధపడుతుండటంతో.. ట్రీట్మెంట్ కోసం బైక్పై ఆస్పత్రికి తీసుకెళ్లారు..చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా..బాబు మెడిసిన్కు సంబందించిన కిట్ కిండపడిపోతుండగా పట్టుకోబోయేలోపు ప్రమాదవశాత్తూ పిల్లాడు తల్లి ఒడి నుంచి జారి పడి బైక్ వీల్లో ఇరుక్కుపోయాడు.
వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు..బిడ్డను కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కానీ.. కానీ అప్పటికే ఆ బాలుడు మృతిచెందినట్లు వారు తెలిపారు.
జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తే ఏకంగా పసివాడు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.
చంద్రబాబు ఆర్టీసీ భూములను తన వాళ్లకు ఇచ్చారు: విజయసాయిరెడ్డి