దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో మూడంతస్థుల భవనం కూలిపోయింది. శిధిలాల కింద పలువురు చిక్కుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న రెస్క్యూ టీమ్ ఇప్పటివరకూ 17 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. మరికొందరు భవనం కింది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మంగళ్దాస్ రోడ్డులోగల లోహ్రా చాల్లోని యూసుఫ్ పేరుతో ఉన్న భవనం ఉన్నట్టుండి కూలిపోయింది.
ఈ భవనాన్ని 1959కి ముందుగా నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీఎంసీకి చెందిన రెస్క్యూ సిబ్బందితో పాటు అగ్నిమాపకదళం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతోంది.