telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

నేటితో .. రెండో విడత ప్రచారం ముగింపు.. 18న పోలింగ్..

election-commission

నేటి సాయంత్రం 5 గంటలకు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రెండో విడుత ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. ఈ దశలో దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలలో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ నెల 18న రెండో విడుత ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. రెండో విడుతలో భాగంగా 97 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

మొదటి విడత అనుభవాలతో ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టే తెలుస్తుంది. మొదటి విడత పోలింగ్ ప్రారంభంలోనే ఈవీఎం లు మొరాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ తగిన చర్యలతో రెండో విడతలో ముందుకుపోతుందని అధికారులు చెపుతున్నారు. నేటి నుండి ప్రచారం ఆపాలని, నిబంధనలు మీరితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు అభ్యర్థులను హెచ్చరించారు.

Related posts