మరో ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ సమరం ఆరంభంకానుంది. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు టోర్నీలో పాల్గొనే ప్రతీ జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. దీనిలో భాగంగానే ఇవాళ రెండు సన్నాహక మ్యాచ్లు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యాయి.
బ్రిస్టల్లో పాకిస్థాన్తో అప్ఘనిస్థాన్ తలపడుతుండగా.. కార్డిఫ్లో సౌతాఫ్రికాతో శ్రీలంక ఢీకొంటోంది. టీమిండియా తన మొదటి మ్యాచ్లో శనివారం న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడనుంది.