కరోనాతో ఇబ్బందులేదుర్కొంటున్న ప్రజలపై పెట్రోల్ ధరల భారం కూడా అధికమవుతోంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వరుసగా 20వ రోజు కూడా ధరలు పెరిగాయి. పెట్రోలుపై లీటర్కు 21 పైసలు, డీజిల్పై 17 పైసలు పెరిగాయి. పెరిగిన ధరల అనంతరం ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకి రూ.80.13గా ఉండగా, డీజిల్ ధర రూ.80.19గా ఉంది.
కోల్కతాలో లీటరు పెట్రోలు ధర రూ.81.82, డీజిల్ ధర రూ. 75.34, ముంబైలో పెట్రోలు ధర రూ.86.91, డీజిల్ ధర రూ.78.51, చెన్నైలో పెట్రోల్ ధర రూ.83.37, డీజిల్ ధర రూ.77.44గా ఉంది. హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ.82.96కి చేరింది. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.