telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పక్కా స్కెచ్ తోనే .. ఆ ఇద్దరికీ విశ్రాంతి..

2 ex governors reserved for special purpose

నేటి వరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ స్థానంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళ సై సౌందరరాజన్ ను నియమిస్తూ ఉత్తర్వలు జారీ అయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన నరసింహన్ కు మరో పోస్ట్ ను కేంద్రం ఇంకా ప్రకటించలేదు. ఆయన వెంటనే కేంద్ర హోమ్ శాఖలో రిపోర్ట్ చేయాలని మాత్రం ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది.

జమ్మూకశ్మీర్ లో ఆయనకు కీలక పదవిని అప్పగించవచ్చని సమాచారం. మరోవైపు ఇప్పటివరకు మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న మాజీ ఎంపీ విద్యాసాగర్ రావుకు సైతం ఏ బాధ్యతలనూ కేంద్రం అప్పగించకపోవటం విశేషం. ఆయన సేవలను మరో రాష్ట్రంలో బీజేపీ తరఫున వాడుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీని మరింతగా బలోపేతం చేసి, 2023 ఎన్నికలు లక్ష్యంగా ఆయనకు బాధ్యతలు అప్పగించే ఆలోచనలో అధిష్టానం ఉన్నారట.

Related posts