సీఐఎస్ఎఫ్ పోలీసులు ఇద్దరు అనుమానాస్పద వ్యక్తుల నుంచి రూ.కోటి నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం దిల్లీ జంగ్పుర మెట్రో స్టేషన్కు వికాస్ చౌహాన్(20), ఆర్తీ(20)లు చేరుకున్నారు. అక్కడి సీఐఎస్ఎఫ్ పోలీసులు వారి బ్యాగును తీసుకుని తనిఖీ చేసేందుకు స్కానింగ్ యంత్రంలో పెట్టగా… అందులో నోట్ల కట్టలు కనిపించాయి.
ఆ నగదు గురించి ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని, నగదును ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న రూ.1.01కోట్లకు సంబంధించి వారి వద్ద ఎలాంటి పత్రాలు లేవని, వాటిలో ఎక్కువగా రూ.500 నోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వికాస్ రాజస్థాన్కు చెందిన వ్యక్తి కాగా, ఆర్తీ మధ్యప్రదేశ్కు చెందినగా మహిళగా గుర్తించారు.