telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ : .. డీఎస్పీలకు .. ఏఎస్పీలుగా పదోన్నతి …

weekly off to telangana police also in 2 days

రాష్ట్రంలో 17 మంది డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం పదోన్నతి పొంది, బదిలీ అయిన వారి వివరాలు..

టి.కరుణాకర్ హైదరాబాద్‌కు, గిరిరాజు వరంగల్‌‌కు, సురేశ్ కుమార్ ఆసిఫాబాద్‌‌కు, షమీర్‌ జేఎస్‌కే రాచకొండకు, ఎన్‌.భాస్కర్‌ నిజామాబాద్‌‌కు, బి.కిష్టయ్య భద్రాద్రి కొత్తగూడేనికి, పి.శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌ సిటీకి, సీహెచ్‌ కుమారస్వామి నారాయణపేటకు, టీఏ భరత్‌ ములుగుకు, ఎండీ రియాజ్‌ ఉల్‌ హక్‌ సిద్దిపేటకు, డి.సంజీవరెడ్డి హైదరాబాద్‌‌కు, ఎం.వెంకటరెడ్డి నిర్మల్‌‌కు, ఎస్‌.వీరారెడ్డి ఇంటెలిజెన్స్‌‌కు, బి.వినోద్‌కుమార్‌ గ్రేహౌండ్స్‌‌కు, పి.శ్రీనివాస్‌ ఇంటెలిజెన్స్‌‌కు, మహమ్మద్‌ బుర్హాన్‌ అలీ హైదరాబాద్‌‌కు, సయ్యద్‌ అన్వర్‌ హుస్సేన్‌ సైబరాబాద్‌‌కు బదిలీ అయ్యారు.

Related posts