తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలో 17 గేదేలు మృతి చెందాయి. రాయికల్ మండలంలోని అయోధ్య గ్రామానికి 250 గేదేల మంద ఎస్సారెస్పీ కెనాల్లో నీళ్లు తాగేందుకు వెళ్లాయి. ఈ తరుణంలో నీటి ప్రవాహానికి గేదేలు కొట్టుకుపోయాయి. ఇందులో ఊపిరి ఆడక ఏకంగా 17 గేదేలు అక్కడిక్కడే మృతి చెందాయి. దీంతో అక్కడ ఉన్న స్థానికులు, రైతులు షాక్ తిన్నారు. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గేదేల మృతి వల్ల నష్ట పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు.