telugu navyamedia
క్రైమ్ వార్తలు

పాత‌బ‌స్తీలో దారుణం : ఓయో రూమ్ కు తీసుకెళ్లి.. బాలికపై అత్యాచారం

*హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో దారుణం చోటుచేసుకుంది..
*పాత‌బ‌స్తీలో మైన‌ర్ బాలిక‌పై గ్యాంగ్ రేప్‌..
*లాడ్జీలో రెండురోజులు పాటు న‌ర‌కం చూపిన కామాందులు
*13 ఏళ్ళ బాలిక‌పై ఓయో లాడ్జీలో అత్య‌చారం

 

హైదరాబాద్ లో మరో గ్యాంగ్ రేప్ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని పాత బస్తీ ప్రాంతంలోని డబీర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

13 ఏళ్ల బాలికకు కిడ్నాప్‌ చేసిన యువకులు ఓయో రూమ్ కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు మందు ఇచ్చి బాలికపై యువకులు గ్యాంగ్‌రేప్‌‌కు పాల్పడ్డారు. రెండ్రోజులపాటు లాడ్జిలో యువకులు ఆమెకు న‌ర‌కం చూపించారు. తరువాత ఆ యువకులు బాలికను లాడ్జిలోనే వదిలి వెళ్లారు.

మొదట ఆమెను కిడ్నాప్ చేసి… హైదరాబాద్‌లోని రెండు హోటళ్లకు బాలికను మార్చుతూ.. ఆపై ఆమెపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

మొదట సుజన్ స్టే ఇన్ హోటల్​కు… తర్వాత త్రీక్యాసిల్ హోటల్‌కు ఆమెను నిందితులు తీసుకెళ్లారు. ఆ తరవాత ఓయో రూమ్‌కు తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డారు.

అక్కడి నుంచి అతి కష్టం మీద బయటపడిన బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఈ విషయంపై డబీర్ పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Related posts